సాధారణంగా కమెడియన్లు కానీ నటులు కానీ తమపై తాము పంచ్ లు వేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు.అయితే బుల్లితెరపై భారీగా పాపులారిటీని సంపాదించుకున్న సుధీర్ మాత్రం ఇతరులు పంచ్ లు వేసినా ఏమీ అనకపోవడంతో తనపై తానే పంచ్ లు వేసుకొని కడుపుబ్బా నవ్విస్తారు.
ఒకవైపు ఎక్స్ట్రా జబర్దస్త్ షోతో బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్ ఈటీవీలో ప్రసారమయ్యే ఈవెంట్లలో పాల్గొనడంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా చేస్తున్నారు.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో ఇమ్మాన్యుయేల్ ఏంటీ.? ఇంత లేట్ గా వచ్చావ్ అని అడగగా సుధీర్ హీరో అడిషన్స్ ఉంటే వెళ్లి వచ్చానని చెబుతాడు.అక్కడ క్లాప్ కొట్టారా అని ఇమ్మాన్యుయేల్ అడగగా అక్కడ క్లాప్ కొట్టలేదని తనను కొట్టారని సుధీర్ చెబుతాడు.
ప్రొడ్యూసర్ ఏది బాగా వస్తే అది చేయమన్నాడని సుధీర్ చెప్పగానే సుధీర్ పాడు పనులు చేసినట్టు బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ వచ్చింది.
ఆ తరువాత ఇమ్మాన్యుయేల్ ఇలా అయితే స్వర్గానికెందుకు పోతావ్.? నరకానికి పోతావ్.? అని చెప్పగా స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక మాత్రమే ఉంటారని నరకంలో అయితే చాలామంది అమ్మాయిలు ఉంటారని సుధీర్ చెబుతాడు.ఆ తరువాత ఇమ్మాన్యుయేల్ నరకంలో కూడా నీ నరుకుడు గురించే ఆలోచిస్తున్నావా.? అని పంచ్ వేస్తాడు.
జూన్ 6వ తేదీన ఈటీవీ ఛానల్ లో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఎపిసోడ్ కు ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ గెస్ట్ గా హాజరయ్యారు.చిన్న ఆర్టిస్ట్ గా జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ తక్కువ కాలంలోనే టీమ్ లీడర్ స్థాయికి ఎదగడంతో పాటు సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకోవడం గమనార్హం.