ఈటీవీ లో దాదాపుగా దశాబ్ద కాలంగా జబర్దస్త్ కార్యక్రమం కొనసాగుతోంది.ఆ పదేళ్ల కాలంలో ఎనిమిది సంవత్సరాలుగా సుడిగాలి సుధీర్ టీమ్ కొనసాగుతూ వస్తుంది.
ఆయన టీమ్ లో ఉన్న రామ్ ప్రసాద్ మరియు గెటప్ శ్రీనులు మంచి పేరును దక్కించుకున్నారు.ఈ త్రయం ఏం చేసినా కూడా నవ్వు వస్తుంది.
జబర్దస్త్ తో పాటు పలు షో ల్లో వీరు కనిపించి సందడి చేస్తూ వస్తున్నాయి.ఏది అయినా కొంత కాలం వరకు మాత్రమే… ఇప్పుడు జబర్దస్త్ కూడా కాలం చెల్లి పోతుందేమో అంటూ వార్తలు వస్తున్నాయి.
జబర్దస్త్ కామెడీ షో విషయంలో మెల్ల మెల్లగా ప్రాభవం తగ్గి పోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.కారణం ఇప్పటికే హైపర్ ఆది పోయాడు.
ఇటీవలే రోజా కూడా వెళ్లి పోయారు.ఇప్పుడు సుడిగాలి సుధీర్ కూడా వెళ్లి పోవడం కన్ఫర్మ్ అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆమద్య ఢీ నుండి సుధీర్ తప్పుకోగా… మరో వైపు జబర్దస్త్ కు కూడా ఆయన మెల్ల మెల్లగా దూరం అవుతున్నాడేమో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
సుడిగాలి సుధీర్ టీమ్ ఈమద్య కాలంలో చాలా వీక్ అయ్యింది.
అందుకే ఆయన వల్ల కామెడీ రావడం లేదు అంటూ మల్లెమాల వారు అమౌంట్ ను తగ్గించారు అనేది టాక్.దాంతో ఇతర ఛానల్స్ లో కనిపించేందుకు గాను సుధీర్ సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
తాజాగా స్టార్ మా టీవీ లో కొత్త కార్యక్రమం సూపర్ సింగర్స్ జూనియర్స్ కార్యక్రమంకు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.ఇందులో స్పెషల్ ఏంటీ అంటే అనసూయ కూడా యాంకర్ గా అదే కార్యక్రమంకు వ్యవహరించబోతున్న నేపథ్యంలో అంతా కూడా షాక్ అవుతున్నారు.
వీరు పక్క ఛానల్ లో షో లకు యాంకరింగ్ చేస్తే ఖచ్చితంగా మల్లెమాల వారి నుండి ఎదురు దెబ్బ లు ఉంటాయి.కనుక సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ను వీడే రోజు వచ్చిందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.