తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుధీర్, రష్మి గౌతమ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వీరిద్దరు జబర్దస్త్ మరియు ఢీ షోల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు.
వీరిద్దరు లవ్లో ఉన్నారని అంతా అనుకుంటున్నారు.వారిద్దరి స్కిట్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది.
ఇద్దరి రొమాంటిక్ సీన్స్కు సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెరపై ఏ జంటకు లేనంత క్రేజ్ వీరిద్దరికి ఉంది.
సుధీర్ తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.
రాజశేఖర్ రెడ్డి అనే యువ దర్శకుడు సుధీర్ హీరోగా సాఫ్ట్వేర్ సుధీర్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.
శేఖర్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు.సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
షూటింగ్ సమయంలోనే సుధీర్తో మరో సినిమాను శేఖర్ రాజు కమిట్ అయ్యాడట.ఆ సినిమా గురించిన చర్చలు జరుగుతున్నాయి.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమాలో హీరోయిన్గా రష్మి గౌతమ్ను అనుకుంటున్నారట.
రాజశేఖర్ రెడ్డి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని వీరిద్దరి కాంబోలో తెరకెక్కించేందుకు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందట.రెండున్నర కోట్లతో శేఖర్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది.లాక్డౌన్ పీరియడ్ పూర్తి అయిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు.
సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఉంది.ఇప్పటి వరకు బుల్లి తెర వరకే పరిమితం అయిన వీరి రొమాన్స్ ఇకపై వెండి తెరపై కనిపించబోతుందన్నమాట.