తెలుగులో గురు,శుక్ర వారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో నుంచి పాపులర్ అయి వెండితెరకు పరిచయం అయిన హీరోల్లో సుడిగాలి సుదీర్ ఒకరు.ఎప్పుడూ తన పంచులతో బల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అలరించేటువంటి సుడిగాలి సుదీర్ వెండితెరపై కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు.
తాజాగా సుడిగాలి సుదీర్ త్రీ మంకీస్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ ఛానల్లో నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో సుడిగాలి సుదీర్ పాల్గొన్నాడు.
ఇందులో భాగంగా తన జీవితంలోని కొన్ని సంఘటనల గురించి తన అభిమానులతో పంచుకున్నాడు.
తాను గతంలో నూతన దర్శకుడు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నటించినటువంటి సాప్ట్ వేర్ సుధీర్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని అందుకు గానూ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
అంతేగాక తన అభిమానుల వల్లే ప్రస్తుతం తాను ఈ పొజిషన్లో ఉన్నానని అన్నారు.అయితే తాజాగా సుధీర్ హీరోగా నటించినటువంటి మరో చిత్రం త్రీ మంకీస్.ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే ఈ చిత్రానికి నూతన దర్శకుడు జి.అనిల్ కుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత మహేష్ నిర్మించారు.
అంతేకాక తాను ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా జబర్దస్త్ కామెడీ షోలో నటించడం మానని ఎందుకంటే జబర్దస్త్ కామెడీ షో వల్లనే తానంటే ప్రజలకు తెలిసిందని అంతేగాక తమకు కూడా తమ టాలెంట్ నిరూపించుకునేందుకు ఓ చక్కటి అవకాశాన్ని కల్పించిందని అన్నారు.అయితే ప్రస్తుతం తాను హీరోగా చేస్తున్నప్పటికీ నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకా చాలానే ఉన్నాయని అప్పుడే హీరోగా ట్యాగ్ ఇవ్వద్దని అంటున్నాడు సుడిగాలి సుధీర్.అయితే ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్ తో పాటు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ కూడా కలిసి నటించారు.
ఎప్పుడూ తమ స్కిట్లతో బుల్లితెర మీద అలరించే ఈ ముగ్గురు వెండితెరపై ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి.