సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు కెరీర్ లో కాస్త ఒడి దొడుకులు ఎదర్కొంటున్నాడు.ప్రస్తుతం ఈయన ‘వి’ సినిమా రిలీజ్ కు వెయిట్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో సుధీర్ బాబు హీరో అయినా కూడా విలన్ పాత్రలో నటించిన నాని గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.భారీ ఎత్తున అంచనాలున్న ‘వి’ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పట్లు జరుగుతున్నాయి.
భారీ అంచనాల నడుమ రూపొందిన ‘వి’ సినిమా విడుదల సందర్బంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మల్టీ స్టారర్ సినిమాల విషయంలో తాను ఎప్పుడు కూడా వెనుకడుగు వేయబోను అంటూ క్లారిటీ ఇచ్చాడు.
మహేష్బాబుతో కూడా మల్టీ స్టారర్ చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.మహేష్ బాబుతో కలిసి హీరోగా చేయడం అంటే సాధ్యం అయ్యే విషయం కాదు.కాని ఈయన మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశం ఉంటుందని త్వరలోనే ఈ బావ బామ్మర్థులను హీరో విలన్ గా చూస్తాము కావచ్చు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
అలాగే కరోనా హాలీడేస్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.త్వరలో ఈయన సర్కారు వారి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవ్వ బోతున్నాడు.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాటను తెరకెక్కంచబోతున్నారు.ఈ సినిమాలో ఏమైనా సుధీర్బాబు కనిపిస్తాడేమో చూడాలి.