రెజినా, నివేదా థామస్ కలిసి నటిస్తున్నా యాక్షన్ మూవీ శాకిని డాకిని.టాలెంటెడ్ డైరక్టర్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది.సినిమా టైటిల్ ఎనౌన్స్ తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు చిత్రయూనిట్.
ఇక ఈ సినిమాను థియేటర్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
కరోనా తర్వాత కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపట్లేదు.
సురేష్ బాబు నిర్మాతగా వస్తున్న సినిమాలన్ని దాదాపు ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.ఈమధ్యనే వెంకటేష్ నటించిన దృశ్యం 2 కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజైంది.
ఇక మరో పక్క సురేష్ బాబు నిర్మాతగా శ్రీసింహా హీరోగా వస్తున్న దొంగలున్నారు జాగ్రత్త సినిమా కూడా ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్స్, టికెట్ ప్రైజ్ విషయంలో తీసుకొచ్చిన కొత్త బిల్లుపై సురేష్ బాబు అసంతృప్తిగా ఉన్నారు.
అందుకే ఆయన చేస్తున్న సినిమాలన్ని వరుసగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.