జబర్దస్త్ బ్యూటీ రష్మీ సినీ కెరీర్ లో హిట్టైన సినిమా గుంటూరు టాకీస్ మాత్రమే అనే సంగతి తెలిసిందే.ఎక్కువ సంఖ్యలో సినిమాలలో రష్మీ నటించినా ఆ సినిమాల ద్వారా రష్మీ ఆశించిన స్థాయిలో గుర్తింపు కూడా దక్కలేదు.
అయితే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో రష్మీకి ఛాన్స్ దక్కడంతో రష్మీ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.వెండితెరపై ఆఫర్లు వస్తున్నా రష్మీ మాత్రం బుల్లితెర షోలను మాత్రం వదలడం లేదు.
సుధీర్, రష్మీ బుల్లితెరపై షోలు, ఈవెంట్లలో చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.తాజాగా ప్రసారమైన ఢీ షో సెమీ ఫైనల్స్ కు మంచు లక్ష్మీ గెస్ట్ గా హాజరయ్యారు.
ప్రదీప్ హైపర్ ఆది, సుధీర్ లను లక్ష్మీగారి కోసం టీమ్ లీడర్స్ గా మీ బాధ్యతలు చెప్పాలని అడగగా ఆది ఈ షోకు తాను, సుధీర్ రెండు పిల్లర్స్ అని సుధీర్ కు ఇద్దరు పిల్లలు అని చెబుతాడు.
మేడం షో గురించి అడిగితే నువ్వు నా గురించి అడుగుతావు ఏంటి అంటూ సుధీర్ ఆదిని అడుగుతాడు.
పూర్ణ, ప్రదీప్ సుడిగాలి సుధీర్ గురించి చెబుతూ సుధీర్ ఈ షోకు వచ్చిన అందరినీ హగ్ అడుగుతారని చెప్పగా మంచు లక్ష్మి “నువ్వు నా దగ్గరికి రా చూద్దాం” అంటూ కామెంట్లు చేస్తారు.ఆ తర్వాత ప్రదీప్ గుంటూరు టాకీస్ పార్ట్2 సుధీర్, రష్మీ చేస్తే ఎలా ఉంటుందో చూపించాలని అడుగుతారు.
స్కిట్ లో భాగంగా రష్మీ సుధీర్ చొక్కా పట్టుకుని కన్ను కొడుతూ ” కోరుకున్న వాడి కన్నా ఏరుకున్న వాడే బాగున్నాడు” అంటూ హైపర్ ఆది చెప్పమన్న డైలాగ్ చెబుతారు.ఆ తర్వాత “ఏరుకోవడం మొదలుపెడితే మాకంటే బాగా ఎవరూ ఏరుకోలేరు” సుధీర్ డైలాగ్ చెప్పి నవ్వించారు.