రాజకీయాల్లో శాస్వత మిత్రులు మరియు శాస్వత శత్రువులు ఉండరు అనే విషయం తెల్సిందే.రాజకీయాల్లో శత్రువులు మరియు మిత్రులు చాలా స్పీడ్గా మారిపోతు ఉంటారు.
మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరియు శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి.రెండు పార్టీలు మిత్ర పక్షంగా బరిలోకి దిగాయి.
కాని అధికారం పంచుకునే సమయంలో గొడవలు తలెత్తడంతో బీజేపీ మరియు శివసేన పార్టీలు విడిపోయాయి.బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ మరియు ఎన్సీపీలతో కలిసి శివసేన పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.
శివసేన పార్టీ మా పార్టీ గురించి బీజేపీ నాయకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బీజేపీ సీనియర్ నాయకుడు సుధీర్ మునగంటి వార్ తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మాకు శివసేన ఎప్పటికి మిత్ర పార్టీనే.
మా రెండు పార్టీల సిద్దాంతాలు ఒకే విధంగా ఉంటాయి.ప్రస్తుతం శివసేన పార్టీ ఏ పార్టీలతో జత కట్టి ఉందో ఆ పార్టీల సిద్దాంతాలకు శివ సేన సిద్దాంతాలకు ఏమాత్రం పోలిక ఉండదు.
కనుక ఖచ్చితంగా బీజేపీతోనే మళ్లీ శివసేన పార్టీ జత కట్టే అవకాశం ఉందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఆయన మాటలు ప్రస్తుతం మహా రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.