ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముమ్మరంగా కొనసాగుతోంది.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రోజురోజుకి క్రమంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం విస్తరిస్తోంది.
కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు.ఈ కార్యక్రమాన్ని మొదటగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టగా ఆ తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరో ప్రభాస్ మూడు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళాడు.
తాజాగా నటుడు ప్రభాస్ హైదరాబాద్ దగ్గర లోని అడవిలో కొన్ని వందల ఎకరాలను దత్తత తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే… హీరో నవీన్ కృష్ణ నుండి ఛాలెంజ్ ను స్వీకరించిన హీరో సుధీర్ బాబు నేడు తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టాడు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేపథ్యంగా హీరో సుధీర్ బాబు తన నివాసంలో మొక్కలను నాటారు.తాజాగా టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని తో కలిసి V చిత్రంలో నటించి సూపర్ హిట్ అందుకోవడంతో మంచి హుషారుగా ఉన్న సుధీర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుధీర్ బాబు తాజాగా విడుదలైన ‘ వి ‘ సినిమా విజయానికి సందర్భంగా మొక్కలు నాటానని సుధీర్ బాబు తెలియజేశాడు.తన పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెబుతానని తెలియజేశాడు.
విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించినప్పుడు లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు మొక్కలు నాటే అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చాడు.
సమాజంలో రోజురోజుకి వాతావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుందని అది దృష్టిలో ఉంచుకొని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఓ వినూత్న కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని సుధీర్ బాబు తెలియజేశాడు.ఇక ఈ కార్యక్రమాన్ని సుధీర్ బాబు నిర్మాత దిల్ రాజుకు, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కు, అలాగే ‘ వి ‘ సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేదిత థామస్, అదితి రావు లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాలని నామినేట్ చేశారు.