టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.
సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్ అదే జోరులో ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ సినిమాలో పరశురామ్ బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి గురించి చూపించ బోతున్నారని సమాచారం.
ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.వీరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.
అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయినా మహేష్ లోని మరొక కోణాన్ని బయటకు తీసాడు త్రివిక్రమ్.
అయితే వీరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాను సూపర్ హిట్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.
ఈ సినిమాను త్రివిక్రమ్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించ బోతున్నాడని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా హాసిని అండ్ హారిక సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరొక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ సినిమాలో ఇంకొక హీరో కూడా నటించ బోతున్నాడని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో సెకండ్ హీరోకు కూడా ఛాన్స్ ఉందంటూ సినీ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది.
ఆ యువ హీరో ఎవరో కాదు సుధీర్ బాబు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి ఇది రూమర్ గానే మిగిలి పోతుందా లేదంటే నిజం అవుతుందా అనేది వేచి చూడాల్సిందే.