ప్రతి శనివారం ఈటీవి ప్లస్ ఛానెల్ లో ప్రసారమయ్యే పోవే పోరా కామెడీ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.అంతేగాక ఈ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సుడిగాలి సుధీర్ మరియు విష్ణు ప్రియలు తమ పర్ఫామెన్స్ లతో షో కి మరింత అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.
అయితే తాజాగా పోవే పోరా షో నిర్వాహకులు ఈనెల 15వ తారీఖున ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోని యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ ప్రోమోని విడుదల చేసిన మూడు రోజుల్లోనే దాదాపుగా 17 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.
అయితే ఈ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరులో మిల్కీ బ్యూటీ తమన్నా డ్యాన్స్ చేసినటువంటి డాంగ్ డాంగ్ అనే పాటకి పోవే పోరా షో లో సుడిగాలి సుధీర్ మరియు విష్ణు ప్రియా అదిరిపోయే స్టెప్పుల వేశారు.
ఈ డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.సుధీర్ పర్ఫామెన్స్ కి ఫిదా అయిన టువంటి నెటిజన్లు సుడిగాలి సుధీర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇందులో భాగంగా మహేష్ బాబు, మిల్కీబ్యూటీ లను మరిపించే విధంగా సుడిగాలి సుదీర్ మరియు విష్ణుప్రియ ల పర్ఫామెన్స్ ఉందంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.మరికొందరైతే సుడిగాలి సుదీర్ బుల్లితెర పవర్ స్టార్ అంటూ కితాబిస్తున్నారు.
అయితే ఇది ఇలా ఉండగా తాజాగా సుడిగాలి సుదీర్ త్రీ మంకీస్ అనే చిత్రంలో నటించాడు.ఈ చిత్రం ఇప్పటికే విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది.
ఎమోషనల్ మరియు త్రిల్లింగ్ సస్పెన్స్ గా ఉన్నటువంటి ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటోంది.