సుధాచంద్రన్ అంటే ఇట్లే గుర్తు వచ్చేది బుల్లితెరపై ఆమె నటించిన చిత్రం మయూరి.ఈమెకు భారతీయ సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.
పదమూడవ ఏట యాక్సిడెంట్ లో తన కాలు పోగొట్టుకుని ఆ తర్వాత తన దృడ సంకల్పంతో కృత్రిమ కాలు ధరించి నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది సుధాచంద్రన్.ఇక ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అనే చెప్పాలి.
ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ లో స్వయంగా ఆమె నటించారు.ఇక అప్పట్లో ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించడం జరిగింది.
అలాగే ఈ సినిమాకు మొత్తం 14 నంది అవార్డులు కూడా దక్కాయి.ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సుధాచంద్రన్ ఆ తర్వాత పలు భాషలలో అనేక చిత్రాలలో నటించచి మెప్పించారు.
ప్రస్తుతం ఆమె బుల్లితెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఇది ఇలా ఉండగా తాజాగా ఆమె ఆలీ యాంకర్ గా చేస్తున్న షో అలీతో సరదాగా షో లో ఈవిడ పాల్గొన్నారు.
ఇక ఈ ఎపిసోడ్ వచ్చేవారం టీవీలో ప్రసారం కానుండగా సందర్భంగా తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేసారు.ఇక ఈ షోలో సుధా చంద్రన్ తనకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు.
ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ బాగా కొనసాగుతుంది.నిజంగా చెప్పాలి అంటే తన బయోపిక్ మొట్టమొదటి బయోపిక్ అంటూ మయూరి పేర్కొన్నారు.ఇక ఆ సినిమా షూటింగ్ అనంతరం తనకు రామోజీరావు బ్లాంక్ చెక్ ఇచ్చారని, అప్పటి నుంచి తన బ్యాంకు బ్యాలెన్స్ ఎప్పుడు కూడా తగ్గలేదని సుధా చంద్రన్ చెప్పుకొచ్చారు.నిజానికి వాళ్ళ అమ్మ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ గా తనని చూడాలని అనుకున్నారని.
కానీ, నేను డాన్సర్ అయ్యాను అని సుధాచంద్రన్ తెలిపారు.ఇక సినిమాలలో నటించేందుకు తన తండ్రి ఓకే అన్నారు కానీ.
తన తల్లి ఒప్పుకోలేదని సుధా చంద్రన్ ఈ సందర్భంగా తెలిపారు.
ఇక ఈ సంభాషణ లో భాగంగా అలీ మీరు సడన్ గా విలన్ పాత్ర ఎందుకు నటించారు అని అడగగా సుధాచంద్రన్ సమాధానం ఇస్తూ పొట్టకూటి కోసం చేశానని అంటూ 13 ఏళ్ల సంవత్సరాల వయసులో తనకు కారు ప్రమాదంలో కాలు పోయిందని, యాక్సిడెంట్ లో తనకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి అని మరోసారి గుర్తు చేసుకున్నారు.అలాగే తనది ప్రేమ వివాహం అని, తన భర్త ఒక పంజాబీ అని, ముందుగా ఇంట్లో వీరి వివాహానికి ఒప్పుకోలేదని, సౌత్ ఇండియన్ అంటేనే కల్చర్ ఉండదని ఇంట్లో వాళ్ళు అన్నారని ఆ సమయంలో తన భర్త సౌత్ ఇండియన్ లోపల ఉంటే పంజాబీలో అగ్రికల్చర్ ఉంటుందని తెలిపారని ఆమె అలీతో అన్నారు.ఇక ఈ ప్రోమో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది.
ఇందుకు సంబంధించి ఫుల్ ఎపిసోడ్ వచ్చేవారం టీవీలో ప్రసారం కానుంది.