ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా మహమ్మారి దేశంలో కూడా తన ప్రతాపం చూపిస్తుంది.అవకాశం దొరికిన ప్రతి చోటకి వెళ్ళిపోతుంది.
బలహీనంగా ఉన్నవారిని కబలించేస్తుంది.ఇప్పటికే చాలా మంది ప్రముఖులు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
సామాన్యుల పరిస్థితి అయితే ఇక చెప్పాల్సిన పని లేదు.ఇంత తీవ్ర రూపం చూపిస్తున్న కరోనా బారిన పడ్డ ప్రముఖుల పరిస్థితిపై చాలా మంది ఆరా తీస్తున్నారు.
గత కొంత కాలంగా ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యం పట్ల విపరీతమైన ప్రచారం జరుగుతుంది.ఆయన కరోనా బారిన పడ్డారని వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో తేజనే స్వయంగా తన ఆరోగ్యం గురించి ఒక వీడియో మెసేజ్ను విడుదల చేశారు.
మీ అందరి ప్రేమ వల్ల, దయ వల్ల, ప్రభుత్వం అందించిన సహాయ సహకారాల వల్ల కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన తరవాత మెల్లమెల్లగా రోజురోజుకి నేను కోలుకుంటున్నాను.
మళ్లీ పాటలు రాస్తున్నాను.నేను చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను.కాకపోతే, ఈ కరోనా ఉండటం వల్ల ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రజలందరి మాదిరిగానే జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది తప్ప నా ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు.అశోక్ తేజ ఆరోగ్యం మళ్లీ విషమంగా ఉందని వార్తల్లో వచ్చినట్టు తెలిసింది.వాటిలో నిజం లేదు.నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని వీడియోలో సుద్దాల అశోక్ తేజ వెల్లడించారు.