2020 సంవత్సరాన్ని దేశంలోని చాలామంది ప్రజలు బ్యాడ్ ఇయర్ గా భావిస్తున్నారు.ఈ సంవత్సరం ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.
కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రజలు తీవ్ర ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.మరోవైపు పలు దేశాల్లో కొత్తగా వెలుగులోకి వస్తున్న వైరస్ లు, బ్యాక్టీరియాలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.
తాజాగా ఒక వింత చేప మనుషులకు మరో ప్రమాదాన్ని తెచ్చిపెడుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉండటం గమనార్హం.సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అనే పేరుతో పిలవబడే ఈ చేపకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని అదే సమయంలో ఈ చేప చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
మన దేశంలోని గంగా నదిలో ఈ చేప దర్శనమివ్వడం గమనార్హం.సాధారణంగా ఈ చేపలు అమెజాన్ నదిలో మాత్రమే ఉంటాయి.
అక్కడ మాత్రమే జీవించే ఈ వింత చేపలు మన దేశంలోని గంగానదిలోకి ఏ విధంగా వచ్చాయనే సంగతి తెలియాల్సి ఉంది.వారణాసిలోని గంగానదిలో కనిపించిన ఈ చేప మాంసం తింటుంది.
డాల్ఫిన్లను సైతం తినగలిగే ఈ చేప చాలా ప్రమాదకరమైన చేప అని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.విచిత్రమైన ఈ చేప బంగారు వర్ణాన్ని పోలి ఉంటుంది.
ఈ చేపల సంఖ్య ఎంత పెరిగితే నీళ్లలోని ఇతర జీవులకు అదే స్థాయిలో ముప్పు పెరుగుతుంది.
వేల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ చేపలు భారత్ లోకి ఏ విధంగా వచ్చాయో ఇప్పటికీ మిస్టరీనే.
శాస్త్రవేత్తలు జాలర్లకు అలాంటి చేపలు కనిపిస్తే వాటిని నదుల్లో మాత్రం వదలవద్దని సూచనలు చేస్తున్నారు.రుచి తెలియని ఈ వింత చేప ఈ జీవి ఆ జీవి అనే తేడాల్లేకుండా అన్ని జీవులను తింటూ జీవనం సాగిస్తూ ఉండటం గమనార్హం.