ధనుష్ ఐశ్వర్య విడిపోవటం అభిమానులను ఎంతగానో బాధ పెడుతున్న సంగతి తెలిసిందే.ధనుష్ ఐశ్వర్య విడిపోవడం గురించి వేర్వేరు కారణాలు ప్రచారంలోకి వస్తున్నాయి.
ధనుష్ సన్నిహితులు ధనుష్ కు వర్క్ అంటే ఎంతో ఇష్టమని లైఫ్ లో వర్క్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని కొన్ని సందర్బాల్లో సినిమాల కొరకు ఇతర నగరాలకు ధనుష్ పరిమితం కావడంతో భార్యతో విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
వీళ్లిద్దరి మధ్య గొడవలు తరచూ జరుగుతూ ఉండేవని సమాచారం.
ఈ గొడవలు ఎక్కువ కావడం వల్లే వీళ్లిద్దరూ విడిపోయారని తెలుస్తోంది.ధనుష్ చాలా రిజర్వ్డ్ గా ఉంటాడని అతని గురించి తెలిసిన అభిమానులు చెబుతున్నారు.
బెస్ట్ ఫ్రెండ్స్ తో కూడా ధనుష్ ఎక్కువ విషయాలు షేర్ చేసుకునేవారు కాదని సమాచారం.పిల్లల అభిప్రాయాలను కూడా తెలుసుకుని ధనుష్ ఐశ్వర్య ఈ ప్రకటన చేశారని తెలుస్తోంది.
మరోవైపు ధనుష్ ఐశ్వర్య విడాకుల ప్రకటన వల్ల సుచీ లీక్స్ వ్యవహారం చర్చకు వస్తోంది.తమిళంలో సింగర్ గా, ఆర్జేగా సుచిత్ర మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ధనుష్ తనపై అత్యాచారం చేశారంటూ సుచిత్ర చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి.ధనుష్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను విడుదల చేసి సుచిత్ర సంచలనం రేపారు.
కొంతమంది హీరోయిన్లతో ధనుష్ క్లోజ్ గా ఉన్నారని సుచిత్ర కామెంట్లు చేశారు.
సుచిత్ర ఆరోపణల గురించి ధనుష్ మాత్రం స్పందించలేదు.ప్రముఖ హీరోయిన్ విడాకులకు కూడా ధనుష్ కారణమని కామెంట్లు వినిపించాయి.ధనుష్ గురించి ప్రచారంలోకి వచ్చిన వార్తలలో చాలా వార్తలు ఐశ్వర్యకు నచ్చలేదని ఫలితంగా విడిపోయారని సమాచారం.
ధనుష్ ఐశ్వర్య విడిపోవడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వీళ్లిద్దరూ విడిపోవడం సరైన నిర్ణయం కాదని చాలామంది నెటిజన్లు చెబుతున్నారు.