అమెరికాలో తెలుగు సంఘాలలో ఒకటైన “ఇండియా అసోసియేషన్ అఫ్ మెంఫిస్” ఎంతో ఘనంగా ప్రతీ ఏటా జరుపుకునే ఇండియాఫెస్ట్…ఈ ఏడాది కూడా జరిపారు.ఇండియా ఫెస్ట్ 2018 నవంబర్ 3న వేలాది మంది ప్రవాస భారతీయులతో పాటుగా విదేశీయులు సైతం ఈ ఫెస్ట్ లో పాల్గొనటంతో మెంఫిస్ పట్టణం అగ్రిసెంటెర్ మారుమోగింది ఇండియాఫస్ట్ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాట్లని ఎంతో చక్కగా రూపొందించడమే కాదు ఆచరణాత్మకంగా ఎంతో మంది వాలంటీర్ల సహాయంతో నిర్వహించింది.
ఈ ఫెస్ట్ లో షెల్బి కౌంటీ గవెర్నమెంట్ అధికారులు.స్థానిక సంస్థ అధిపతులు.కొన్ని వేలమంది విద్యార్థులు పాల్గొన్నారు.స్థానిక హోటళ్లు.రెస్టారెంట్లు నోరూరించే భారతీయ వంటకాలతో విందు చేస్తే ఎందరో ఔత్సాహిక కళాకారులూ సాంస్కృతిక కార్య క్రమాలతో కళాభిమానుల్ని ఉర్రోతలూగించారు.టాలీవుడ్.
బాలీవుడ్.కోలీవుడ్ సినిమాలను అనుకరిస్తూ చేసిన నృత్యాలు మొదలు భారతీయ సంస్కృతిని ప్రతిభింబించే లా నృత్య ప్రదర్సనలు చేశారు.
ఆర్ట్స్ మెంఫిస్ మరియు టేనస్సీ ఆర్ట్స్ కమిషన్ ఆర్ధిక సహాయంతో స్పిరిట్యుయల్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రమణ వాసిలి నేతృత్వం మరియు శిక్షణలో ఈ నృత్య ప్రదర్శన జరిగింది.ఈ కార్యక్రమానికి శ్రీమతి ఇందిరా మండలి మరియు శ్రీమతి సుష్మిత కుంటమల్ల చిన్నారులకి మేకప్ మరియు కాస్ట్యూమ్స్ తో సహకారాన్ని అందిస్తే శ్రీ వాన రత్నాకర్ ఆడియో మరియు వీడియో సహకారం అందించడం జరిగింది.
తాజా వార్తలు