సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి.అయితే ఈ మధ్యకాలంలో అందులో ఎక్కువ శాతం వార్తలు ఫేక్ వార్తలే వస్తున్నాయి.
ఇంకా ఈ నేపథ్యంలోనే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా ఆడే గేమ్ సబ్ వె సర్ఫర్స్.ఈ గేమ్ లో ప్లే స్టార్ లో 100 కోట్లకు పైగా డౌన్లోడ్ లు సంపాదించుకుంది.
ఈ గేమ్ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త వచ్చింది.ఆ వార్త గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
ఆ వార్త ఏంటంటే? ఓ వ్యక్తి కొడుకు రైలు ప్రమాదంలో మరణించాడు.దీంతో ఆయన తన కుమారుడి జ్ఞాపకార్థంగా ఈ గేమ్ను రూపొందించారు అని.ఆ వ్యక్తి ట్విట్ చేశాడు.దీంతో ఆ ట్విట్ ఒక్కసారిగా వైరల్ గా మారింది.
ఇంకా గేమ్ కూడా నిజంగానే అలాగే ఉండడంతో నిజంగానే అలాగే రూపొందించారెమో అనే ఆలోచనలో అందరూ షేర్ చేశారు.
అయితే నిజానికి అలా ఏమి జరగలేదు.
అది తప్పు అని తెలుసుకున్న అతను మరుసటి రోజుకే ఆ వార్త తప్పు అని మరుసటి రోజే దాన్ని డిలీట్ చేస్తూ క్షమాపణ కోరారు.అయితే అప్పటికే అనేకమంది దాన్ని రీట్వీట్ చేస్తూ తెగ ప్రచారం చేశారు.
దీంతో చివరికి సబ్వే సర్ఫర్స్ సహ వ్యవస్థాపకులు సీబో ఈ వార్తను కొట్టిపారేశారు.వీధి సంస్కృతికి నివాళిగా కొత్తదనంతో ఈ ఆటను రూపొందినట్టు స్పష్టం చేశారు.
ఈ ఆటను ఆదరిస్తున్నవాళ్లందరికీ ధన్యవాదాలు అని అయన తెలిపారు.