సమంత నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత చైసామ్ విడిపోవడానికి కారణాలు ఇవేనంటూ అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ప్రధానంగా సమంత పర్సనల్ డిజైనర్ అయిన ప్రీతమ్ జుకల్కర్ ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు.
సమంతకు పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ తో ఎఫైర్ ఉందంటూ అసత్య వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఈ వార్తల సమంత అభిమానులు సైతం హర్ట్ అయ్యారు.
సమంత ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా స్పందించి ఆ వార్తల్లో నిజం లేదని తన గురించి తప్పుగా ప్రచారం చేయవద్దని కోరారు.అయితే తాజాగా ప్రీతమ్ జుకల్కర్ సమంతను తాను చెల్లి అని పిలుస్తానని చాలామందికి తెలుసని పేర్కొన్నారు.
సమంతతో తనకు ఎఫైర్ అంటగట్టడం ఏమిటని ప్రీతమ్ కామెంట్లు చేశారు.చెల్లి అని పిలిచే సమంతకు తాను ఏ విధంగా ఐ లవ్ యూ చెప్పగలనని ప్రీతమ్ కామెంట్లు చేశారు.
ఇలాంటి ఫేక్ వార్తలను రాస్తూ ఎందుకు దిగజారుతున్నారంటూ ప్రీతమ్ మీడియాను సైతం ప్రశ్నించారు.
సమంత ఇప్పటికే బాధలో ఉన్నారని ఇలాంటి వార్తల ద్వారా ఆమెను మరింత ఇబ్బంది పెట్టడం సరికాదని ప్రీతమ్ చెప్పుకొచ్చారు.సమంతతో తను ఏ విధంగా ఉంటానో చైతన్యకు తెలుసని చైతన్య పుకార్లపై స్పందించి ఉంటే బాగుండేదని ప్రీతమ్ వెల్లడించారు.
చైతన్య ఇందుకు సంబంధించిన ఒక స్టేట్ మెంట్ ను విడుదల చేసినా బాగుండేదని ప్రీతమ్ పేర్కొన్నారు.నాగచైతన్య నుంచి ఇప్పటికైనా ఒక ప్రకటన వస్తే బాగుంటుందని ప్రీతమ్ అభిప్రాయపడ్డారు.సమంతకు తాను అండగా నిలబడతానని ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా తాను వెనక్కు తగ్గనని ప్రీతమ్ తెలిపారు.
తన కెరీర్ ను నాశనం చేస్తామంటూ కొంతమంది బెదిరిస్తున్నారని ప్రీతమ్ చెప్పుకొచ్చారు.తన తల్లి చనిపోయారని కొంతమంది ఫేక్ వార్తలు ప్రచారం చేశారని ఆయన అన్నారు.