SFI-DYFI ఆధ్వర్యంలో డిపో మేనేజర్,సి.ఐ లకు విన్నతి.
బస్ ని కొనసాగిస్తామని డిపో మేనేజర్ హామీ బస్ ని నడిపించకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతాం నేతల హెచ్చరికజీ కె బంజర బస్ రూట్ సర్వీస్ రేగులచలక,కోయచలక,కోటపాడు, చిమ్మపుడి, పాపాటపల్లి,జికే బంజర ఆరు గ్రామాల మీదుగా గతంలో నడిచిన బస్ సర్వీస్ ని వెంటనే కొనసాగించాలని,లేకుంటే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతాం అన్ని డి వై ఎఫ్ ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు తుడుం ప్రవీణ్ లు డిమాండ్ చేశారు.
GK బంజర బస్ రూట్ ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ SFI-DYFI ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్,డిపో లో ఉన్న డిపో మేనేజర్ శంకర్ రావు,సి.ఐ గౌతమి గార్లకు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా కొద్దిసేపు డిపో మేనేజర్ కి నాయకులకు వాగ్వాదం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ గతంలో నడిచిన జి.కే బంజర బస్ నడపకపోవడం వల్ల ఖమ్మం కళాశాలకు వచ్చే సుమారు వంద మంది విద్యార్థులు,అదేవిధంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రధానంగా విద్యార్థులు కళాశాలలకు సమయానికి చేరుకోలేక తిరిగి ఇంటికి చేసురుకొనే సరికి రాత్రి ఎమినిది,తొమ్మిది అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అమ్మాయిలు,తల్లిదండ్రులు భయాందోళనకు గురికావాల్సి వస్తుందని వారు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యకంగా బడి బస్ లు నడిపిస్తామని చెప్తే ఆర్టీసీ అధికారులు గతంలో నడిచే బస్ లనే తీసివేయడం కరక్ట్ కాదని అన్నారు.విద్యార్థుల,ప్రయాణికుల సౌకర్యార్థం వెంటనే జి.కే బంజర బస్ రూట్ సర్వీస్ ని కొనసాగించాలని లేకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతాం అన్ని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో KVPS జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల.
సాగర్,తెలంగాణ పబ్లిక్ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్(AIRTWF)జిల్లా కార్యదర్శి జిల.ఉపేందర్,SFI-DYFI నాయకులు దొంతు.గణేష్,దశరద.సురేష్,షేక్.సాధిక్,చపల.వీరబాబు,దంతాల.
సందీప్, తుపాకుల.వినోద్,గాడిచర్ల.
మధు, గంగుల.వినోద్, జింక్కల.
రఘు,పావురాల.నవీన్,గౌతమ్ బాబు,షేక్.
యాకుబ్ పాషా,గోకినేపల్లి.ఉదయ్ కిరణ్,SFI-DYFI గర్ల్స్ మరియు యంగ్ ఉమెన్ లీడర్స్ జింక్కల.
మేఘన,చింతల.సుకన్య,అంజలి,దశరద.
అంజలి,కాలంగి.మనస,పరిమిశెట్టి.
లీలావతి, తోడేటి.శ్రీలత,మేడే.
పూజిత,మౌనిక తదితరులు పాల్గొన్నారు.*
.