హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి గదిలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు విద్యార్థి నారాయణస్వామి.
అనంతరం ప్రిన్సిపాల్ ను పట్టుకున్నాడు.దీంతో విద్యార్థితో పాటు ప్రిన్సిపాల్, కాలేజ్ ఏఓలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
గమనించిన కాలేజీ సిబ్బంది గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.అయితే టీసీ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం వేధిస్తుందని విద్యార్థి ఆరోపిస్తున్నాడు.