ఒకే ఓవర్లో యువరాజ్ సింగ్ చేతిలో ఆరు బాల్స్ కు ఆరు సిక్సర్లు కొట్టించుకున్న స్టువర్ట్ బ్రాడ్.ఆతర్వాత ఎన్నో విజయాలను మరెన్నో ఘనతలను సాధించాడు.
తాజాగా స్టువర్ట్ బ్రాడ్ టెస్ట్ లలో 500ల వికెట్స్ ను తన ఖాతాలో వేసుకొని ఈ ఘనతను సాధించిన ఏడవ బౌలర్ గా ఫాస్ట్ బౌలర్స్ లో నాలుగవ బౌలర్ గా రికార్డ్ నమోదు చేశాడు.
తాజాగా ఈ ఇంగ్లీష్ పేసర్ పాకిస్థాన్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో బ్యాట్స్మెన్ అవుట్ అయి పెవిలియన్ కు వెళ్తున్న సమయంలో అతనితో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
ఈ విషయాన్ని ఆన్ ఫీల్డ్ అంపైర్ లు మ్యాచ్ రెఫరీకి ఫిర్యాదు చేశారు.ఐసిసి నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్రాడ్ కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతను విధించారు.
ఇది సాధారణంగా క్రికెట్ లో అందరు ప్లేయర్స్ కి జరుగుతూ ఉంటుంది.కాని ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ మ్యాచ్ రెఫరీ ఎవరో కాదు స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్.
తన కొడుకుకి ఒక తండ్రి ఇలా మ్యాచ్ ఫీజ్ లో కోత విధించారన్న ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.