ఏ క్షణం ఎలాంటి వార్త వినవలసి వస్తుందో తెలియని పరిస్దితుల్లో దేశప్రజలు బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.అసలు ఈ సంవత్సరం గడిస్తే గానీ బ్రతికే వారు ఎవరు, పోయే వారు ఎవరో తెలిసేది.
ఎందుకంటే కరోనా రూపంలో లోకాన్ని మృత్యువు ఏలుతుంది.అందిన కాడికి మనుషుల ప్రాణాలను తోడేస్తుంది.దీని ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాచింది.
కాగా ఈ వైరస్ దెబ్బకు ఇప్పటికే పలు చోట్ల కఠిన ఆంక్షలు అమలు చేస్తుండగా, మరోకొన్ని చోట్ల రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తమిళనాడులో సైతం కోవిడ్ విషయంలో మరింత కఠిన నిర్ణయాల వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది.కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న 13 జిల్లాల్లో కఠిన లాక్ డౌన్ విధించే ఆలోచనలో ఆ రాష్ట్రం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈమేరకు ఈ రోజు లేదా రేపు కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం కనిపిస్తోందని సమాచారం.