దేశంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటినుండి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ వైరస్ ప్రభావం ఉన్న జిల్లా తూర్పు గోదావరి.
వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి తూర్పుగోదావరి జిల్లాలో భారీ స్థాయిలో కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.కరోనా వచ్చిన ప్రారంభంలో ఇప్పుడు సెకండ్ వేవ్ సమయంలో కూడా తూర్పుగోదావరి లో.పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ అమలులోకి తీసుకు రావటం మాత్రమే కాక.కొన్ని వ్యవస్థలపై.మరింత ఆంక్షలు విధించడం జరిగింది.
అయితే తూర్పుగోదావరి జిల్లాలో.రోజుకి 1000 కి పైగా కొత్త కేసులు నమోదు కావటం మరో 10,000 యాక్టివ్ కేసులు ఉండటంతో.
తాజాగా అక్కడి జిల్లా యంత్రాంగం ఆంక్షలు కఠినతరం చేసింది.
నేటి నుండి ప్రార్థనా మందిరాలు అన్నిటిని క్లోజ్ చేయాలని డిసైడ్ అయ్యింది.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే.వ్యాపార కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగింది.
ముఖ్యంగా రోజుకి వెయ్యికి పైగా కొత్త కేసులు బయటపడటంతో పాటు జిల్లాలో పది వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉండటంతో… ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.