అబద్ధం ఎంతపని చేస్తుందో అందరికి తెలిసిందే.కానీ మరీ ప్రాణాలను ప్రమాదంలో పడేలా చెప్పే అబద్ధం వల్ల ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి.
ఇప్పుడు జరిగిన ఘటన ఇలాంటిదే. ఒక అపరిచితుడు చెప్పిన అబద్ధం కొన్ని నిమిషాల పాటు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.
ఆ వివరాలు తెలుసుకుంటే.ఈ రోజు శంషాబాద్ విమానాశ్రయంలోని డెకథ్లాన్ స్పోర్ట్స్ రూమ్లో రిమోట్ బాంబ్ పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ రావడంతో దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కాగా ఆ అగంతకుడు కోటి రూపాయలు ఇవ్వాలని లేకుంటే రిమోట్తో బాంబును పేల్చేస్తామని హెచ్చరించాడట.సత్వరమే అప్రమత్తం అయిన పోలీసులు బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు.ఇలా విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన తర్వాత ఎక్కడ బాంబు లేదని తేల్చడంతో స్టోర్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుందట.ఇక ఆ వెధవను ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారట.