ఏదైనా ఫంక్షన్కి వెళ్లినప్పుడు అతిథులు ఆహ్వానించినవారికి గిఫ్ట్లు తీసుకెళుతూ ఉంటారు.అలాగే అతిథులకు కూడా రిటర్న్ గిఫ్ట్గా ఏదోక బహుమతి అందజేసే సాంప్రదాయం ప్రతీచోట ఉంది.
ముఖ్యంగా పెళ్లిళ్లలో రిటర్న్ గిఫ్ట్ అనేది కామన్గా ఉంటుంది.పెళ్లికి వచ్చినవారికి ఏదొకటి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చి పంపిస్తారు.
రిటర్న్ గిఫ్ట్గా ఏవైనా దుస్తులు లేదా ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు ఇస్తూ ఉంటారు.
కానీ పుదుచ్చేరి( Puducherry )లోని ఓ కుటుంబం కాస్త వినూత్నంగా ఆలోచించింది.అందరిలా చేస్తే కొత్తదనం ఏముంటుందని అనుకున్నారేమో కానీ.విభిన్నంగా ఆలోచించారు.
శుభకార్యానికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్ట్గా మందు బాటిల్స్ ఇచ్చారు.ఇది చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
శుభకార్యానికి వెళ్లినప్పుడు తాంబూలం, అరటికాయ, కొబ్బరికాయ, తమలపాకు లాంటివి ఇస్తూ ఉంటారు.కానీ ఈ కుటుంబం తమ ఇంట్లోని శుభకార్యానికి వచ్చినవారికి ఒక బ్యాగ్లో లిక్కర్ బాటిల్ ఇచ్చి పంపించింది.
అతిథులు ఇంటికి వెళ్లిన తర్వాత ఓపెన్ చేసి చూడగా లిక్కర్ బాటిల్( Liquor bottles ) కనిపించింది.దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.మందుబాబులు మాత్రం ఈ రిటర్న్ గిఫ్ట్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే కొంతమంది నెటిజన్లు దీనిపై ఫైర్ అవుతున్నారు.భారతీయ సాంప్రదాయాలను చెడగొట్టవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మందు బాటిళ్లు ఇవ్వడం ఏంటని ఫైర్ అవుతున్నారు.ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు.
ఇలాంటి కొంతమంది వల్ల భారత సంస్కృతీ, సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయని ఆరోపిస్తున్నారు.భారతదేశంలో ఇంటికి వచ్చినవారికి బట్టలు పెట్టడం, లేదా ఏవైనా వస్తువులు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు.
ఇలా మందుబాటిల్స్ ఇచ్చి కొంతమంది ఇదే కొత్త ట్రెండ్ అంటూ చెప్పుకొస్తున్నారు.వీరి వల్ల మన సాంప్రదాయలు భవిషత్తు తరాలకు తెలిసే అవకాశం ఉండదని అంటున్నారు.