తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే దుబ్బాక పంచిన ఆక్సిజన్ తో జోష్లో ఉన్న బీజేపీ ఇక్కడ కూడా తమదే విజయం అని భావిస్తుండగా, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కూడా గెలుస్తామనే ధీమాలో ఉన్నాడు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కూడా ఇదే నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు.ఇకపోతే ఈ ఎన్నికల్లో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్, బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్ మధ్యే పోటీ అని సర్వేలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా సాగర్లో ఈరోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది.ఇందులో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి పానుగోతు రవికుమార్ నాయక్ ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్నా కానీ, ధైర్యం సరిపోవడం లేదు.కాబట్టి మీరంతా నన్ను గెలిపించి ముందుకు నడిపించండని కన్నీరుమున్నీరుగా విలపించారట.మరి ఓటర్లు బీజేపీ అభ్యర్థి రవినాయక్ కన్నీటి పర్యంతానికి చలించి విజయాన్ని అందిస్తారో లేదో చూడాలి