పార్వతీపురం మన్యం జిల్లా నాయుడువీధిలో వింత శబ్దాలు కలకలం రేపుతున్నాయి.ఇప్పల పోలమ్మ గ్రామ దేవత గుడిలో గజ్జల చప్పుళ్లు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
దీంతో భక్తులు ఆలయానికి బారులు తీరారు.గుడిలో నుంచి పసుపు వాసనతో పాటు గాజులు, గజ్జెల మోతాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
రోజువారీ లానే సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత దేవాలయాన్ని మూసివేశారు అర్చకులు.కాసేపటి తర్వాత గుడిలో నుండి శబ్దాలు వస్తున్నాయని అంటున్నారు.
దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.