పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరులో వింత వ్యాధి మళ్లీ ప్రబలుతోంది. పట్టణంలో గతంలో మాదిరిగానే తాజాగా ఒక వ్యక్తి ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చి కిందపడి కొట్టుకున్నాడు.
వెంటనే స్థానికంగా ఉన్న కొంత మంది అతన్ని అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.దీంతో వైద్యులు అతనికి పరీక్షలు అన్ని నిర్వహించి శాంపిల్స్ ల్యాబ్ కి పంపారు.
ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే బాధ్యత వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి తరలించినట్లు త్వరలోనే రిపోర్టులు రానున్నట్లు, ఏ కారణం చేత అతనికి ఇలా జరిగింది అన్న విషయాన్ని వైద్యులు రిపోర్టర్లు వచ్చాక తెలపనున్నరట.ఈ క్రమములో మళ్లీ వింత వ్యాధి బయటపడటంతో స్థానికులలో భయాందోళన మొదలైంది.ఇటీవలే పశ్చిమగోదావరి శివారు ప్రాంతం భీమడోలు లో కూడా ఈ వింత వ్యాధి వల్ల చాలామంది ఆసుపత్రి పాలయ్యారు.ఈ క్రమంలో అసలు ఈ వ్యాధికి మూలకారణం ఏంటి అన్నదానిపై ఇంకా స్పష్టత రాకపోవడం తో ప్రభుత్వంపై ప్రజలు విమర్శలు చేస్తూ ఉన్నారు.
.