సాధారణంగా మనకు చీకటి అంటే ఎంతో కొంత భయం ఉంటుంది.అంతేకాక ఎవరూ లేని దారిలో చీకటిలో మనం ఒక్కరమే వెళ్తుంటే ఇక మనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మనం నడుస్తాం.
కాని ఆ చీకట్లో ఏదైనా శబ్ధం వినిపిస్తే, మనుషులు ఎక్కడా లేని చోట మనిషి లాంటి వింత జీవి కనిపిస్తే ఇక మనకున్న భయం రెట్టింపు కావడం ఖాయం.అవును సరిగ్గా కర్ణాటకలో ఇలానే జరిగినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది.
కోటాలోని మంగుళూరు నుండి ఉడిపి హైవేలో ప్రయాణిస్తుండగా ఓ వింత జీవి సంచరించిందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఈ విషయం ప్రచారం లోకి ఎలా వచ్చిందంటే ఓ పేపర్ బాయ్ తాను ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఓ వింత జీవిని ఈ పేపర్ బాయ్ చూశాడని, ఆ వింత జీవి అతనిని వెంబడించిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
కాని అది గొరిల్లా లా కనిపిస్తుందని, చీకటి కాబట్టి మనకు సరిగ్గా ధృవీకరించలేకుండా ఉందని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
.