పోలీస్ స్టేషన్ లో రోజురోజుకూ కేసులు ఎక్కువ అవ్వడం వల్ల అటు పోలీసులు ఇటు న్యాయ మూర్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దేశం మొత్తం మీద రోజుకు కనీసం వేలల్లో కేసులు నమోదు అవ్వడంతో వీటన్నిటిని పరిష్కరించడం పెద్ద రిస్క్ తో కూడుకుంది.
అయినప్పటికీ పోలీసులు న్యాయ మూర్తులు అన్ని కేసులను పరిష్కరించడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నారు.
ఎలాంటి కేసు అయినా పరిష్కరించడం పోలీసులు బాధ్యత.
అందుకే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు.కానీ మరీ పోలీసుల సహనాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు కొన్ని వింత కేసులు వస్తూ ఉంటాయి.
తాజాగా ఇలాంటి వింత కేసు ఒకటి పోలీసుల వద్దకు వచ్చింది.అయితే పోలీసులు ఎలాంటి కేసు వచ్చిన నమోదు చేసుకోవాలి కాబట్టి ఈ కేసు కూడా నమోదు చేసుకున్నారు.
ఇంతకీ అంత వింత కేసు ఏమయ్యుంటుందా అని ఆలోచిస్తున్నారా.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.పోలీసుల దగ్గరకు కోడి మర్డర్ కేసు వచ్చింది.ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది.
ఒక వ్యక్తి తాను పెంచుకుంటున్న కోడి మర్డర్ అయ్యిందని వారిని పట్టుకుని శిక్షించాలని కోరుతూ పోలీసుల దగ్గరకు ఈ కేసు విన్న పోలీసులకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు.
అసలు ఇలాంటి కేసు కూడా పెట్టవచ్చా అని అందరు ఆశ్చర్య పోతున్నారు.ఒక వ్యక్తి చనిపోయిన కోడిని తీసుకువచ్చి ఎవరో విషం పెట్టి చంపేశారని పోస్టుమార్టం చేసి వారిని కనిపెట్టి శిక్షించాలని పోలీసులకు తెలిపాడు.తాను ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న ముద్దుల కోడిని విషం పెట్టి చంపినందుకు వారికీ తప్పకుండ శిక్ష పడాలని ఆ వ్యక్తి కోరాడు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.