ప్రపంచంలో ఏదో ఒక మూలాన ఏదో ఒక వింత చోటు చేసుకుంటూనే ఉంటుంది.మన తెలుగు రాష్ట్రాల్లో అయితే .
ఏ వింత జరిగినా అది బ్రమ్మం గారు ఎప్పుడో చెప్పారు ఇలాంటి వింతలు విశేషాలు జరుగుతాయని అంటూ జనం చెవులు కొరుక్కుంటూ ఉంటారు.ఈ సంఘటనలన్నీ పక్కనపెట్టి విషయంలోకి వెళితే…
కర్ణాటకలోని కొడగు జిల్లా సోమవారపేటకు చెందిన భవననిర్మాణ కార్మికుడు జీకే మూర్తి భార్య చిన్నమ్మకు సోమవారం రాత్రి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.అక్కడ ఆమె వింత శిశువుకు జన్మనిచ్చింది.కానీ వెనుక తోక ఆకారంలో జన్మించిన ఆ వింత శిశువు జన్మించిన కొద్దిసేపటికే కన్నుమూసింది.
అయితే ఆ శిశువుకు ఒకటే కాలు ఉంది, వెనుక తోక లాంటి భాగం పుట్టింది.ఆడ, మగో తెలుసుకోవడానికి జననాంగాలు లేవని వైద్యులు తెలిపారు.కాగా జన్మించిన కొద్దిసేపటికే ఆ శిశువు మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.ఈ తరహా వింత శిశువు జన్మించడం ఇదేం కొత్త కాదని జన్యుపరమైన లోపాలతో ఇలా జన్మిస్తారని వైద్యనిపుణులు చెబుతున్నారు.