సాధారణంగా మనం వినాయకచవితి రోజున అనేక రకాల పూలను,పత్రాలను తీసుకువచ్చి వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటాం.అయితే ఇలా పూజించే పత్రాలలో తులసి పత్రాలు ఉండవు.
పరమ పవిత్రమైన తులసి వినాయకుని పూజలో లేకపోవటానికి ఒక కారణం ఉంది.
అది ఏమిటంటే… ఒక రోజున వినాయకుడు గంగా తీరంలో విహారం చేస్తూ ఉండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుణ్ణి మోహించి వివాహం చేసుకోమని కోరెను.
దానికి వినాయకుడు సమ్మతి తెలపకపోవటంతో ఆ యువరాణి బ్రహ్మచారిగా ఉండమని వినాయకుణ్ణి శపించెను.
దానికి ప్రతిగా వినాయకుడు ఆమెకు రాక్షసుని వద్ద ఉండమని శాపం ఇచ్చెను.
వినాయకుని శాపానికి చింతించిన రాకుమారి వినాయకుణ్ణి మన్నించమని కోరగా, అప్పుడు వినాయకుడు కొంతకాలం రాక్షసుని వద్ద ఉన్నాక, పవిత్రమైన తులసిగా జన్మిస్తావని చెప్పారు.అందుకే వినాయక పూజలో తులసి ఉండదు.