జనసేన పార్టీకి గుర్తు కేటాయించిన ఈసీ..! ఆ గుర్తు వెనకున్న అసలు కథ ఇదేనా.?

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది.ఈ మేరకు శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.

 Story Behind Janasena Party Symbol-TeluguStop.com

జనసేనకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయిస్తూ శనివారం రాత్రి ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు.

ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ‘గాజు గ్లాసు’ గుర్తుతోనే పోటీ ఉంటారు.ఈ గుర్తుని ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 42 లోకసభ నియోజకవర్గాలున్నాయి.2019లో జరగనున్న ఏపీలోని 25 లోకసభ, తెలంగాణలోని 17 లోకసభ స్థానాలలో ఈ గుర్తుపై పోటీ చేస్తుందని ఈసీ తెలిపింది.2019లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఈ గుర్తు మీద పోటీ చేస్తారు.పార్లమెంటు సాధారణ ఎన్నికలతోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఇదే గుర్తు వర్తిస్తుంది.

గాజు గ్లాస్‌లను టీ కోసం వాడతారు.అంటే ఇకపై పవన్ కల్యాణ్ కూడా చాయ్‌ పే చర్చ లాంటి ప్రోగ్రామ్ మొదలు పెడతారేమో చూడాలి.చాయ్ పే చర్చ అనేది ప్రధాని మోదీ ట్రేడ్ మార్క్.ఓ చాయ్ వాలా స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు.తాను కూడా కిందిస్థాయి వ్యక్తినేనని పవన్ కళ్యాన్ చెబుతూ వస్తున్నారు.ఓ సాధారణ హెడ్ కానిస్టేబుల్ కొడుకునని చెబుతున్నారు.

సమాజంలో సగటు మానవులు పడే ఇబ్బందులన్నీ తన నిజజీవితంలో ఎదుర్కొని వచ్చిన వాడినేనని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube