ఏపీని అతలాకుతలం చేస్తున్న పెథాయ్ తుఫాను ప్రభావం తో జనజీవనం స్తంభించిపోయింది.తుఫాను ప్రభావంతో….
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో….భారీ పంట.ఆస్తినష్టం ఏర్పడింది.తాజాగా… ఈ పెథాయ్ తుఫాను కాట్రేనికోన వద్ద తీరం దాటింది.దీంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.ఇది ఇలా ఉంటే… తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి గంటా శ్రీనివాసరావు కారు తీరంలోని ఇసుక గుంతలో ఇరుక్కుపోయింది.
దీంతో ఆయన రక్షణ సిబ్బంది కారును బయటకు లాగేందుకు తీవ్రంగా కసరత్తు చేయాల్సి వచ్చింది.
.