క్రికెట్ లో కొత్తరూల్ స్టాప్ క్లాక్..రేపటి నుంచే అమల్లోకి తీసుకురానున్న ఐసీసీ..!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ICC ) క్రికెట్ లో ఓ సరికొత్త రూల్ స్టాప్ క్లాక్( Stop Clock ) అనే నిబంధనను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.

స్టాప్ క్లాక్ నిబంధన అంటే ఏమిటో తెలుసుకుందాం.

పొట్టి ఫార్మాట్ లో ఓవర్ కు ఓవర్ కు మధ్య అధిక సమయం వృధ అవుతుందని భావించిన ఐసీసీ.ఈ స్టాఫ్ క్లాక్ నిబంధనను అందుబాటులోకి తెచ్చింది.

ఈ నిబంధన ప్రకారం ఓవర్ కు ఓవర్ కు మధ్య 60 సెకండ్ల సమయాన్ని మాత్రమే గ్యాప్ టైం గా ఫిక్స్ చేసింది.అంటే ఒక ఓవర్ పూర్తయిన తర్వాత 60 సెకండ్ల కాలంలో మరో ఓవర్ ప్రారంభించాలి.

రెండుసార్లు ఈ నిర్దిష్ట వ్యవధి దాటితే మూడోసారికి బౌలింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ( Five Runs Penalty ) విధిస్తారు.

Advertisement

అంటే బ్యాటింగ్ జట్టుకు అదనంగా 5 పరుగులు యాడ్ అవుతాయి.ఫీల్డ్ అంపైర్లు( Field Umpires ) స్టాప్ క్లాక్ తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు.నవంబర్ 21న అహ్మదాబాద్ లో జరిగిన క్రికెట్ బోర్డ్ సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్ 12వ తేదీ ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్( Eng vs WI ) మధ్య ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ నుంచి ఈ స్టాప్ క్లాక్ నిబంధనను ఐసీసీ ఆచరణలో పెట్టనుంది.

ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 2024 వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుంది.ఈ స్టాప్ క్లాక్ నిబంధన పురుషుల టీ20, వన్డే ఫార్మాట్ లలో అమల్లో ఉంటుంది.ఏప్రిల్ 2024 తర్వాత ఈ నిబంధన టీ20 వరల్డ్ కప్ లో ఉంటుందా లేదా అనే దానిపై ఐసీసీ స్పష్టత ఇవ్వనుంది.

కేవలం మ్యాచ్ సమయం వృధా కాకుండా ఆదా చేసేందుకు మాత్రమే ఐసీసీ ఈ నిబంధనను అమల్లోకి తీసుకురానుంది.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...
Advertisement

తాజా వార్తలు