లోకంలో మంచి వారు ఎవరో, చెడ్ద వారు ఎవరో గుర్తించడం చాలా కష్టం.అందులో మంచి వాడిగా నటించే చెడ్దవాన్ని పసిగట్టడం ఇంకా కష్టం.
ఇకపోతే మాట మంచిగా ఉన్నప్పుడు తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకోవడం కామనే అయినా ఆ అప్పు తిరిగిచ్చే సమయంలో మాత్రం ఏదో తన డబ్బు అప్పు ఇచ్చినవాడు దోచుకెళ్లుతున్న ఫీలింగ్తో ఉంటారు.
ఇక తీసుకున్న డబ్బు ఇవ్వమని అడిగామా ఇదిగో ఇలాగా చేస్తారు.
ఏం చేస్తారని ఆలోచిస్తున్నారా అయితే చదవండి.నెల్లూరులోని దండోరా కాలనీలో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు రెచ్చిపోయాడో యువకుడు.
తన స్నేహితులను వెంట తీసుకొచ్చి తీసుకున్న అప్పు ఇవ్వమన్న ప్రసాద్ అనే వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.బైక్పై వచ్చిన ఆ ముగ్గురు యువకులు ప్రసాద్పై విరుచుకుపడటమే కాదు ఇటుక రాయి తీసుకుని తలపై దాడి చేశారట.
విచక్షణ రహింతగా చితకబాధగా తీవ్ర గాయాలైన లెక్కచేయకుండా ఆ బాధితుడు అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడట.ఇక ఈ విషయం పై సమాచారం అందుకున్న వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారట.