తెలంగాణ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు సజ్జనార్ స్థానంలో స్టీఫెన్ రవీంద్ర..!!

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎంతో మంది ఆదరాభిమానాలు సంపాదించుకున్న సజ్జనార్ నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈ క్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Telugu Sajjanar-Telugu Political News

సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా దాదాపు మూడు సంవత్సరాల పాటు సేవలు అందించారు.అనేక పేరుగాంచిన కేసులో దర్యాప్తు చేసి కీలక పాత్ర పోషించారు.ముఖ్యంగా దేశాన్ని కుదిపేసిన దిశ కేసులో ఆయన వ్యవహరించిన తీరు.ఆయన చేసిన ఎన్ కౌంటర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇప్పటికీ కూడా సజ్జనార్ చేసిన ఎన్ కౌంటర్ పట్ల సోషల్ మీడియాలో సామాన్యులు తో పాటు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన స్థానం లోకి స్టీఫెన్ రవీంద్ర రావటంతో పాటు పోలీసు శాఖలో మంచి పట్టు ఉన్న అధికారిగా పేరు ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సల్స్ నీ అరికట్టడంలో స్టీఫెన్ రవీంద్ర ప్రముఖ పాత్ర పోషించారు.అటువంటి వ్యక్తి ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడం సంచలనంగా మారింది.

ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలకంగా స్టీఫెన్ రవీంద్ర పోలీస్ వ్యవస్థ లో రాణించారు.ఈ క్రమంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళ లో ఏపీకి స్టీఫెన్ రవీంద్ర ని.తీసుకు రావటానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు.కేంద్ర హోంమంత్రి వద్ద కూడా స్టీఫెన్ రవీంద్ర ప్రస్తావన అప్పట్లో వైఎస్ జగన్ ప్రస్తావించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఎంతో నిబద్ధత కలిగిన పోలీసు అధికారిగా మంచి పేరున్న స్టీఫెన్ రవీంద్ర నీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube