మనం సాధారణంగా ప్రయాణించే సమయంలో మన ఫోన్ లో ఉన్న ఛార్జింగ్ కాలీ అయ్యిందంటే ఎక్కడో ఒక్కచోట ఫోన్ కి ఛార్జింగ్ పెట్టేస్తుంటాం.అయితే ఇలా చేయడంతో మన ఫోన్ లోని డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుందంటూ తాజాగా స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సంస్థ హెచ్చరించింది.
ఇందుకు సంబందించిన వీడియోని కూడా ఎస్బీఐ బ్యాంకు విడుదల చేసింది.ఇందులో భాగంగా మన స్మార్ట్ ఫోన్ ని ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ చేసుకోవద్దని, ఒకవేళ ఫోన్ ని ఎక్కడపడితే ఛార్జింగ్ చేస్తే హ్యాకర్లు తమ వైరస్ సాఫ్ట్ వేర్ల ద్వారా ఫోన్ లోకి చొరబడి ఫోన్లో విలువైన డేటాను దొంగిలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.
అలాగే సెక్యూర్ కానీ పవర్ స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ చేస్తే మన ఫోన్లోకి మాలవేర్ అనే వైరస్ ని ప్రవేశ పెట్టి హ్యాకర్లు మన ఫోన్లో ఉన్నటువంటి బ్యాంకు అకౌంట్ కి సంబందించిన వివరాలు, పాస్ వర్డ్స్ వంటివి దొంగలించి క్షణాల్లో ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బులను కాజేస్తారని సూచించింది.కాబట్టి అత్యవసర సమయాల్లో తప్ప అన్ని సమయాల్లోనూ పవర్ స్టేషన్లను ఛార్జింగ్ కోసం ఉపయోగించరాదని హెచ్చరించింది.ఇంకా వీలైతే సొంత పవర్ బ్యాంకులను ఉపయోగిస్తే మంచిదని సూచించింది.
.