భారత సైన్యంలోకి అత్యాధునిక యుద్ధ హెలికాఫ్టర్లు చేరాయి.వీటిని జోధ్ పూర్ బేస్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైన్యానికి అప్పగించారు.
ఈ క్రమంలో 15 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు సైన్యం చేతికి వచ్చాయి.కాగా హెలికాప్టర్ల డిజైన్, డెవలప్మెంట్ దేశీయంగానే రూపొందాయి.
కంబాట్ హెలికాప్టర్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది.దశలవారీగా సైన్యానికి మరిన్ని హెలికాప్టర్లను అప్పగిస్తామని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.