అనేక అంతర్గత,బహిర్గత సవాళ్లును ఎదుర్కోంటుందని పేర్కొన్నారు.దేశంలో కరోనా మూడవ దశ కొనసాగుతోందని అన్నారు.
సియం జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోంటోందని తెలిపారు.కరోనా కట్టడిలో గ్రామ స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు వాలెంటీర్ వ్యవస్థ విశేషంగా కృషి చేస్తోందని అన్నారు.
నూతన జిల్లాల ఏర్పాటు వ్యవస్థను సమర్థవంతంగా చేపట్టారని చెప్పారు.నూతన జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన మరింత చేరువ అవుతుందని అన్నారు.
ఆయా ప్రాంతాల చారిత్రక, సాంస్కృతిక నేపధ్యాలను దృష్టిలో పెట్టుకోని నూతన జిల్లాలకు నామకరణం చేయడం అభినందనియమని అన్నారు.