కరోనా ఎఫెక్ట్.. స్టేట్ బ్యాంక్ కొత్త రూల్స్..?

కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గతంలో స్టేట్ బ్యాంక్ తమ వినియోగదారుల కోసం కొన్ని వెసులుబాటులు కనిపించింది.

 State Bank New Rules To Their Customers,state Bank,new Rules,customers,corona Ef-TeluguStop.com

ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఖాతాదారులకు చేయూతనిచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.అయితే ప్రస్తుతం దేశంలో రెండో దశ అన్లాక్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎస్బిఐ గతంలో ఇచ్చిన సడలింపులు జూన్ 30వ తేదీతో ముగిసిపోయాయి, జులై 1వ తేదీ నుంచి సరికొత్త రూల్స్ ని అమలులోకి తీసుకు వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.పట్టణ ప్రాంతాల్లో ఏటీఎం నుంచి నెలకు ఎనిమిది వేల విత్ డ్రాయిల్స్ మాత్రమే ఫ్రీ గా పొందేందుకు వీలుండగా… గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10 వేల రూపాయలను విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఇందులో ఐదు స్టేట్ బ్యాంక్, 5 ఇతర బ్యాంకు ఎటిఎంల నుంచి లావాదేవీలు చేసుకోవచ్చు.ఈ పరిమితి మించితే మాత్రం చార్జీలు పడతాయి అంటూ సరికొత్త రూల్స్ తెర మీదికి తెచ్చింది.

ఇకపైన పిన్ మార్చుకోవడం బ్యాలెన్స్ చెక్ చేయడం లాంటివి కార్యకలాపాలకు కూడా ఎనిమిది రూపాయలతో పాటు జీఎస్టీ కూడా వసూలు చేయనున్నారు.అంతే కాకుండా బ్యాంకు ఖాతాల్లో మినిమం బాలన్స్ నిబంధన మరోసారి అమలులోకి తెచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube