ఈ రోజు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపటిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.దీనితో అభ్యర్థులు అందరిలో ఉత్కంఠ నెలకొంది.జ్యోతిష్యులు చెప్పినట్లు హాంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందా,లేదా మిగిలిన సర్వే లు చెప్పినట్లు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడు తుందా అన్న ఉత్కంఠ తో అందరూ ఎదురుచూస్తున్నారు.177 స్థానాలకు సంబందించిన కౌంటింగ్ జరుగుతుండగా, ఇప్పటివరకు విడుదల అయిన కౌంటింగ్ ఫలితాల ప్రకారం పలు చోట్ల వైసీపీ ఆధిక్యం లో ఉంది.ఇప్పటివరకు కుప్పం నియోజక వర్గంలో జరుగుతున్న తోలి రౌండ్ లెక్కింపు లో ఏపీ సి ఎం చంద్రబాబు వెనకపడ్డారు.
ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన వైసీపీ పార్టీ అభ్యర్థి చంద్ర మౌళి 67 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.
అలానే ఏపీ లోని పలు మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో వెనుకంజ లో ఉన్నట్లు తెలుస్తుంది.భూమా అఖిల ప్రియ కూడా వెనుకంజ లో ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే సొంత నియోజకవర్గం ఆయిన కుప్పంలో చంద్రబాబు కొంత వెనుకంజలో ఉండడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.కుప్పం నియోజకవర్గం తొలి రౌండ్లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళికి 4456 ఓట్లు రాగా… టీడీపీ అభ్యర్థి చంద్రబాబుకు 4389 ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది.