బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కభీ ఈద్ కభీ దివాళీ సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.
ఇకపోతే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా సందడి చేయనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ లో షూటింగ్ పనులతో బిజీగా ఉన్న చిత్ర బృందాన్ని మెగా కోడలు ఉపాసన లంచ్ కి ఆహ్వానించడంతో సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్ , పూజా హెగ్డే చరణ్ ఇంట్లో సందడి చేశారు.ఈ క్రమంలోనే చరణ్ దంపతులతో పాటు సల్మాన్ వెంకటేష్ పూజా హెగ్డే అందరూ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ అతిధి పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే చిత్రబృందం తరచూ హైదరాబాద్ లో సందడి చేస్తున్నారు.గత కొద్ది రోజుల క్రితం విక్రమ్ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా కమల్ హాసన్ మెగాస్టార్ చిరంజీవిని కలిసినపుడు సల్మాన్ ఖాన్ కూడాహాజరయ్యారు.మెగా కుటుంబానికి సల్మాన్ ఖాన్ కి మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉంది.ఈ క్రమంలోనే హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి ఈయన చిరు ఫ్యామిలీని కలుస్తూ ఉంటారు.
ఇకపోతే సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో అతిథి పాత్రలో సందడి చేయనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే సల్మాన్ చిత్రంలో చెర్రీ అతిథి పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం వీరందరూ కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతుంది.