ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ సింగర్ల జాబితాలో ఎక్కువగా సిద్ శ్రీరామ్ పేరు వినిపిస్తోంది.తెలుగులో సిద్ శ్రీరామ్ పాడిన పాటల్లో ఎక్కువ పాటలు హిట్ కావడం గమనార్హం.
చిన్న హీరోలు సైతం తమ సినిమాల్లో సిద్ శ్రీరామ్ తో పాటలు పాడిస్తున్నారు.సిద్ శ్రీరామ్ పాట వల్ల సినిమా హక్కులకు కూడా డిమాండ్ పెరిగి సినిమా హక్కులు ఎక్కువ మొత్తానికి అమ్ముడవుతున్నాయి.
అయితే ఈ సింగర్ రెమ్యునరేషన్ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం ఈ సింగర్ ఒక పాటకు నాలుగున్నర లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.
కొన్ని నెలల క్రితం వరకు పాటకు నాలుగు లక్షల రూపాయల పారితోషికం తీసుకున్న సిద్ శ్రీరామ్ కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రెమ్యునరేషన్ పెంచారని తెలుస్తోంది.ప్రస్తుతం తెలుగులో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సింగర్ మరెవరూ లేరని చెప్పాలి.
మరోవైపు కొంతమంది దర్శకనిర్మాతలు సినిమాలో ఒక పాటైనా సిద్ శ్రీరామ్ తో పాడించాలని సంగీత దర్శకులపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ సిద్ శ్రీరామ్ కోసం ప్రత్యేకంగా ట్యూన్స్ ను కంపోజ్ చేస్తుండటం గమనార్హం.సిద్ శ్రీరామ్ కు ఉన్న క్రేజ్ ను చూసి ఇతర సింగర్లు సైతం షాకవుతున్నారు.గీతా గోవిందం, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాల్లో శ్రీరామ్ పాడిన పాటలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు.
ఐ సినిమాతో సింగర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సిద్ శ్రీరామ్ ఆ సినిమాలో నువ్వుంటే నా జతగా పాటను పాడారు.ఆ పాట హిట్ కావడంతో పాటు సిద్ శ్రీరామ్ కు స్టార్ సింగర్ గా గుర్తింపు రావడానికి కారణమైంది.