గతంలో ప్రపంచంలో ఏ వ్యాధి వ్యాప్తి చెందనంత వేగంగా కరోనా మహమ్మారి విజృంభించిన సంగతి తెలిసిందే.వైరస్ వ్యాప్తి మొదలై 12 నెలలు గడిచినా మహమ్మారి గురించి భయాందోళన ప్రజల్లో ఏ మాత్రం తగ్గలేదు.
దగ్గినా, తుమ్మినా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వ్యాధి కావడంతో ప్రజలు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు.కరోనా బారిన పడితే నెగిటివ్ వచ్చినా కొంతమంది దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడుతున్నారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపిన ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి.కొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా బారిన పడుతూ ఉండటం గమనార్హం.
కొన్ని నెలల క్రితం ప్రముఖ సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.కరోనా సోకిన సమయంలో ఎదురైన అనుభవాల గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరోనా నిర్ధారణ అయిన సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె చెప్పారు.
లండన్ నుంచి ఇండియాకు వచ్చిన కొత్తలో ముంబైలో జరిగిన పార్టీల్లో తాను పాల్గొన్నానని.తనకు క్వారంటైన్ గురించి ఎవరూ చెప్పకపోవడం వల్ల తాను అలా చేశానని అన్నారు.పార్టీల్లో పాల్గొన్న తర్వాత కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయిందని అన్నారు.
ఆ తర్వాత పార్టీలో పాల్గొన్న వారికి కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించానని అన్నారు.
అయితే తనకు కరోనా సోకినా తనతో పాటు పార్టీలో పాల్గొన్న ఒక్కరికి కూడా వైరస్ నిర్ధారణ కాలేదని అన్నారు.
ఆ తరువాత కొంతమంది తనకు కాల్ చేసే చనిపోవాలని చెప్పారని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని ఆ సమయంలో చాలా బాధ పడ్డానని ఆమె అన్నారు.
తాజా వార్తలు