తెలుగులో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మ్యూజిక్ డైరెక్టర్లలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లకు ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు లేవు.కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు వయస్సురిత్యా పరిమితంగా సినిమాలు చేస్తున్నారు.
తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్, థమన్ మాత్రమే ఆప్షన్లుగా మిగిలారు.దేవి శ్రీ ప్రసాద్ పరిమితంగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తుంటే థమన్ మాత్రం వచ్చిన ప్రతి ఆఫర్ కు ఓకే చెబుతూ ఆ సినిమాలతో విజయాలను అందుకుంటున్నారు.
అఖండ విడుదలకు ముందు థమన్ భారీస్థాయిలో ఈ సినిమాకు ప్రమోషన్స్ చేశారు.ఆ ప్రమోషన్స్ కు తగ్గ ఫలితం ఇప్పుడు లభిస్తోంది.
సోషల్ మీడియాలో థమన్ ను ప్రశంసిస్తూ చాలామంది పోస్టులు పెడుతున్నారు.థమన్ బీజీఎం సినిమాకు మరో లెవెల్ కు తీసుకెళ్లిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
అఖండ సినిమా వల్ల థమన్ కు సినిమా ఆఫర్లు భారీగా పెరుగుతున్నాయి.
థమన్ అఖండ వల్ల వచ్చిన గుర్తింపును దృష్టిలో ఉంచుకుని పారితోషికంను భారీగా పెంచేశారు.
థమన్ పెద్ద సినిమాలే ఎక్కువగా చేస్తున్న నేపథ్యంలో నిర్మాతలు కూడా థమన్ అడిగిన మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు.థమన్ ఇకపై మూడు కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకోవాలని ఫిక్స్ అయ్యారని బోగట్టా.థమన్ మ్యూజిక్ వల్ల సినిమాలకు భారీస్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థమన్ ఇతర మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.మరికొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో థమన్ హవా కొనసాగే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.థమన్ గతంలో తనపై వ్యక్తమైన విమర్శలకు సైతం తన మ్యూజిక్ ద్వారా చెక్ పెడుతున్నారు.
థమన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.