గతేడాది లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలైన సమయంలో ప్రేక్షకులకు భారీ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అందించిన రియాలిటీ షోగా బిగ్ బాస్ షో పేరును సంపాదించుకుంది.ఈ ఏడాది బిగ్ బాస్ షో త్వరగా ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా, లాక్ డౌన్ వల్ల షో అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటం గమనార్హం.
అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే భారీగా పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలు షోలో పాల్గొననున్నారని తెలుస్తోంది.
తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 5 ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుందని సమాచారం.
ఆగష్టు నెల 29వ తేదీన నాగార్జున పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ షో ప్రోమో రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.గతేడాది బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల ఎంపికపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
పెద్దగా పేరున్న సెలబ్రిటీలను బిగ్ బాస్ షోలోకి తీసుకోలేదనే కామెంట్లు వినిపించాయి.
ఈసారి మాత్రం లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ జరిగిందని జూమ్ ద్వారా కంటెస్టెంట్లతో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.బిగ్ బాస్ షో కొరకు ఇప్పటికే కొందరిని ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుండగా ఎవరెవరిని ఎంపిక చేశారనే సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.బిగ్ బాస్ నిర్వాహకులు 100 మంది ప్రముఖులను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సీజన్ 3, సీజన్ 4 సక్సెస్ కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా నాగార్జున కారణమనే సంగతి తెలిసిందే.సీనియారిటీ ఉన్న యాక్టర్ కావడంతో తనదైన శైలిలో హోస్టింగ్ చేసి ప్రేక్షకులను తన హోస్టింగ్ ద్వారా ఆకట్టుకుంటున్నారు.బిగ్ బాస్ షో మొదలయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు కూడా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.