స్క్రీన్ పత్రిక కూడా ఎట్టకేలకు అమ్మడైపోయింది.అందుకు కారణాలు వెతికితే లభించేది ఒక్కటే .
సుమారు అరవై ఏళ్ళ క్రితం ఉత్తరాది కోటీశ్వరులైన గోయింకాలు ఇండియన్ ఎక్స ప్రెస్ ను దక్షిణాదిలో విస్తరించాలని దృఢసంకల్పం తో తెలుగు(ఆంధ్రప్రభదినపత్రిక ,ప్రభ వారపత్రిక )తమిళ్ (దినమణి కదిర్ )కన్నడ(కన్నడ ప్రభ )వంటి పత్రికలూ పెడుతూ ముందుకు సాగారు .అదే సమయం లో పక్కా ప్రెస్సులు సమకూరి ఉన్నందున స్క్రీన్ అనే ఇంగ్లీష్ వారపత్రిక పెడితే పోలా అని పెట్టేసారు .లక్షల్లో సర్క్యులేషన్ తో చాలా ఏండ్లు అప్రతిహాతంగా నడిచింది .ఎప్పడైతే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసిందో అక్కడితో చాలా పత్రికలకు మూడిందనే చెప్పాలి .ఇక స్క్రీన్ పత్రిక కూడా అధమస్థాయి సేల్స్ తో ఇరవై మంది స్టాఫ్ తో మరి పత్రికకు పూర్వవైభవం రానేరాదానే స్థితికి చేరుకొంది .ఎప్పుడు మూసేద్దామా అనే పరిస్థితిలో ఉత్తరాది స్టార్ వాళ్ళు కొనుగోలు చేసిసి పత్రికగా కాకుండా వెబ్ పేపర్ గా మార్చేసారు చివరి పత్రిక ఈ నెల ఫస్టు వీక్ తో ఆఖరయ్యింది .పత్రికలో స్టాఫ్ ను కొత్త యాజమాన్యం తీసుకుంది
.