ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్క విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకునే అవకాశం వచ్చింది.అంతేకాకుండా ఒకప్పటి విషయాలు కూడా ఈ తరం వాళ్ళకు పరిచయం చేస్తున్నారు.
అప్పట్లో ఇలాంటి మాధ్యమాలు లేకపోవడంతో ఇప్పుడు పాత విషయాలను కొత్తగా పరిచయం చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా స్టార్ హీరోస్ కలిసి దిగిన ఒకప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగులు అని వాయిదా పడటంతో సెలబ్రిటీలు అంతా ఇంట్లో ఉంటూ ఎన్నో విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.ఇక తాజాగా 33 ఏళ్ల కిందట స్టార్ హీరోస్ అందరూ కలిసి ఉన్న ఫోటో వైరల్ గా మారింది.
చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 786 సినిమా.ఈ సినిమాకు విజయ బాపినీడు దర్శకత్వం వహించాడు.ఇందులో భానుప్రియ హీరోయిన్ గా నటించింది.అంతేకాకుండా మోహన్ బాబు, కోట శ్రీనివాసరావు పలువురు నటులు ఈ సినిమాలో నటించారు.
ఇక ఈ సినిమా 1988 జూన్ 10న విడుదల అయింది.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోగా.
ఆ సందర్భంగా విజయబాపినీడు, చిరంజీవి లతో పాటు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు కూడా పాల్గొన్నారు.
విజయ బాపినీడు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లతో మంచి సన్నిహితంగా ఉండేవారట.ఆయన కోసం ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఏ కార్యక్రమానికైనా కాదనకుండా వచ్చేవారట.ఇక ఈ పిక్ ఆ సమయంలో దిగగా ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.
ఇది చూసిన నెటి జనులు వారి మధ్య స్నేహాన్ని గురించి తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.