టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్.కెరియర్ ఆరంభంలో మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో అవకాశం అందుకొని బ్లాక్ బస్టర్ కొట్టిన పూరీ ఆ తరువాత వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడుగా ఎదిగిపోయాడు.
తన మేకింగ్, ప్రెజెంటేషన్ తో తెలుగు ఇండస్ట్రీకి సరికొత్త హీరోయిజం పరిచయం చేసిన పూరీ చివరిగా ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాతో హిట్ కొట్టాడు.తరువాత పూరీ దర్శకత్వం వచ్చిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకొని ఇక పూరీ పని అయిపోయింది అనే రేంజ్ కి పడిపోయాడు.
తన సినిమాలో హీరో పాత్రలలో ప్రేక్షకులని మెప్పిస్తున్న.కథ, కథనం విషయంలో రొటీన్ మూసలో వెళ్తున్న పూరీ సినిమాలు ప్రేక్షకులకి అస్సలు రుచించలేదు.ఈ నేపధ్యంలో వరుసగా నాలుగు ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే రామ్ హీరోగా మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తాజాగా పూరీ జగన్నాథ్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
ఈ సినిమా ట్రైలర్ చూసినపుడు ఎవరికి పెద్దగా కనెక్ట్ కాకపోయిన హీరో రామ్ పాత్ర, సాంగ్స్ భాగా కనెక్ట్ కావడంతో సినిమా మీద మంచి బజ్ వచ్చింది.ఇక రిలీజ్ తర్వాత మొదటి రోజు ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న తరువాత హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రికార్డ్ స్థాయి విజయం సొంతం చేసుకుంది.
రామ్ కెరియర్ లో రెడీ తర్వాత మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా హిట్ తో ఇన్ని రోజులు పూరీని పక్కన పెట్టిన స్టార్ హీరోలు మరల పలకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
పూరీతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించని నిర్మాతలు, స్టార్ హీరోలు మళ్ళీ పూరీతో సినిమా కోసం ఒకే అంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.దీంతో ఇస్మార్ట్ శంకర్ మరల పూరీ ఫేట్ మార్చింది అనే మాట ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.